Supreme Court: వివేకా కేసులో పిటిషన్లన్నీ కలిపి విచారిస్తాం
ABN , Publish Date - May 08 , 2025 | 05:26 AM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన పిటిషన్లన్నింటిని ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది

విచారణ 20కి వాయిదా: సుప్రీం
న్యూఢిల్లీ, మే 7(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి, గంగిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బుధవారం సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్లు విచారణకు వచ్చాయి. అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలోని కేసులతో ఈ పిటిషన్లను కూడా ట్యాగ్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.