Share News

Vijayawada: ఆస్పత్రి నుంచి పీఎస్ఆర్‌ డిశ్చార్జి

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:05 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 కేసులో నిందితుడు పీఎస్ఆర్‌ ఆంజనేయులు విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి గురువారం మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.

Vijayawada: ఆస్పత్రి నుంచి పీఎస్ఆర్‌ డిశ్చార్జి

  • హైదరాబాద్‌కు పయనం.. 26న తిరిగి జైలుకు

విజయవాడ, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 కేసులో నిందితుడు పీఎస్ఆర్‌ ఆంజనేయులు విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి గురువారం మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు. జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయన.. అనారోగ్యంగా ఉందని చెప్పడంతో ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందజేశారు. ఇదిలా ఉండగా, పీఎస్ఆర్‌కు విజయవాడ కోర్టులో మధ్యంతర బెయిల్‌ (వైద్యం నిమిత్తం) మంజూరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ఆయన తన సొంత వాహనంలో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆయన ఈనెల 26వ తేదీన జైలులో లొంగిపోవాల్సి ఉంది.

Updated Date - Jun 13 , 2025 | 05:06 AM