Deputy CM Pawan: వీర జవాన్ కుటుంబానికి రూ.25 లక్షల సాయం
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:22 AM
ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన అగ్నివీర్ సైనికుడు మురళీనాయక్ కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

మాట నిలుపుకొన్న ఉప ముఖ్యమంత్రి పవన్
చెక్కు అందజేసిన జనసేన ఎమ్మెల్యేలు
హిందూపురం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన అగ్నివీర్ సైనికుడు మురళీనాయక్ కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన మురళీనాయక్ కశ్మీర్లో మే 9న వీరమరణం పొందారు. 11న అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పవన్... ఆ కుటుంబానికి రూ.25 లక్షల సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును జనసేన తిరుపతి, పాలకొండ ఎమ్మెల్యేలు అరణి శ్రీనివాసులు, జయకృష్ణ శనివారం వీర జవాన్ కుటుంబానికి అందజేశారు.