Presidential Tribute Ceremony: నీలం సంజీవరెడ్డికి రాష్ట్రపతి ముర్ము నివాళి
ABN , Publish Date - May 20 , 2025 | 06:44 AM
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళి అర్పించారు. 1977 నుంచి 1982 వరకు భారత 6వ రాష్ట్రపతిగా ఆయన సేవలు అందించారు.

న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళి అర్పించారు. రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డి 1977-1982 మధ్యకాలంలో భారత 6వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు లోక్సభ స్పీకర్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డి పనిచేశారు.