జగన్ ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తారో: అచ్చెన్న
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:09 AM
ఇచ్చిన హామీలు అమలు చేయలేని వైసీపీ అధినేత జగన్... పాదయాత్ర పేరిట ఏ మొఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తాడో చెప్పాలి’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

టెక్కలి, జూలై 3(ఆంధ్రజ్యోతి): ‘ఇచ్చిన హామీలు అమలు చేయలేని వైసీపీ అధినేత జగన్... పాదయాత్ర పేరిట ఏ మొఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తాడో చెప్పాలి’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం రాత్రి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చాకిపల్లిలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘జగన్ది కర్కోటక మనస్తత్వం. అతని వాహనం కింద ఓ కార్యకర్త పడి మృతి చెందినా పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి అవసరమా?’ అని అచ్చెన్న ప్రశ్నించారు.