Share News

MLA Nasir Ahmed: జగన్‌, భారతి.. మహిళలకు క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:41 AM

మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణారెడ్డిల కు కొమ్ముకాస్తున్న జగన్‌, సాక్షి ఎండీ వైఎస్‌ భారతి మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని గుంటూరు...

MLA Nasir Ahmed: జగన్‌, భారతి.. మహిళలకు క్షమాపణ చెప్పాలి

  • ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌, నరసింహ యాదవ్‌

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణారెడ్డిల కు కొమ్ముకాస్తున్న జగన్‌, సాక్షి ఎండీ వైఎస్‌ భారతి మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మహిళలను ఎన్నో రకాలుగా అవమానించిన వైసీపీ నాయకులు, అధికారం కోల్పోయినా వారినే లక్ష్యంగా చేసుకుని అవమానించడం వారి నీచ సంస్కృతికి నిదర్శమన్నారు.

Updated Date - Jun 11 , 2025 | 06:40 AM