Share News

అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:21 PM

మంత్రులు, ఎమ్మె ల్యేలు, రెండు జిల్లాల ఎంపీలు, టీడీపీ ముఖ్యనేతలు, రైతుల సహకారంతో బ్యాంకు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన విష్ణువర్దనరెడ్డి అన్నారు.

    అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా
కేడీఎసీసీబీ చైర్మనగా బాధ్యతలు స్వీకరిస్తున్న విష్ణువర్ధనరెడ్డి

రైతులకు మేలు చేస్తా

సీఎం నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

రాజవర్దనరెడ్డి ఆశయసాధనకు కృషి చేశా

ఏనాడూ పదవుల కోసం ఆరాట పడలేదు

డీసీసీబీ చైర్మన విష్ణువర్దన రెడ్డి

ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం

హాజరైన ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు

భారీగా తరలివచ్చిన రైతులు

కర్నూలు అగ్రికల్చర్‌, జూన 6(ఆంధ్రజ్యోతి): మంత్రులు, ఎమ్మె ల్యేలు, రెండు జిల్లాల ఎంపీలు, టీడీపీ ముఖ్యనేతలు, రైతుల సహకారంతో బ్యాంకు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ చైర్మన విష్ణువర్దనరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కాన్ఫరెన్స హాల్లో బ్యాంకు చైర్మనగా రైతుల సమక్షంలో ఘనంగా ప్రమాణస్వీకారోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి కోడుమూరు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున రైతులు, అనుచరులు, టీడీపీ వర్గాలు తరలి వచ్చారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథులుగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీఎంఎస్‌ చైర్మన వై.నాగేశ్వరరావు యాదవ్‌, పరిశీలకుడు రామలింగేశ్వరరెడ్డి, ఇతర నాయకులు బొజ్జన్న పాల్గొన్నారు. బ్యాంకు సీఈవో రామాంజనేయులు చైర్మన విష్ణువర్దనరెడ్డితో ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయించారు. ఈ సం దర్భంగా విష్ణువర్దనరెడ్డి ఎంతో భావోద్వేగంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన తనయుడు రాజవర్దనరెడ్డి ప్రజలతో మమే కమై వారి కష్టసుఖాలే తన జీవనంగా కొనసాగించారని, అకాల మరణంతో తాను ఎంతో బాధ అనుభవించినా చివరకు ఆయన ఆశయాన్ని సాధించేందుకు టీడీపీ వేదికగా కష్టపడుతూ వచ్చాన న్నారు. తనమీద నమ్మకంతో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మనగా పదవి ఇచ్చారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని రైతుల సమక్షంలో ప్రకటించారు. ఏనాడూ పదవుల కోసం ఆరాట పడలేదని, ప్రజల కష్టాసుఖాల్లో పాలుపంచుకోవడానికే ప్రతి క్షణం ఆరాటపడ్డానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఒక సైనికుడిలా పని చేశానన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకే కాకుండా పొదుపులక్ష్మి మహిళలకు, అన్ని వర్గాల వారికి ఆర్థిక చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ విష్ణువర్దన రెడ్డి కర్నూలు జిల్లాలో టీడీపీ తిరుగులేని విధంగా గొప్ప స్థానాన్ని అందించారన్నారు. అనంతరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవో రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, రాబోయే కాలంలో రూ.6వేల కోట్ల వ్యాపారాన్ని పెంచుకుని మూడో స్థానానికి ఎదిగేందుకు చైర్మన తమకు అం డగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి రామాంజనేయులు, బ్యాంకు బీఎం శివలీల, డీజీఎంలు నాగిరెడ్డి, సునీల్‌ కుమార్‌, ఉమామహేశ్వరరెడ్డి, ఏజీఎంలు త్రినాథ్‌ రెడ్డిలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల మనిషి విష్ణువర్దన రెడ్డి : తిక్కారెడ్డి

కోడుమూరు నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా, ప్రజల మనిషిగా విష్ణువర్దన రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారనీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు ఉమ్మడి జిల్లా సహకార బ్యాంకు చైర్మన పదవిని విష్ణువర్దనరెడ్డికి అప్పగించడం సంతోషంగా ఉందన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:21 PM