Share News

Arja Srikanth: నేటితరం సివిల్‌ సర్వెంట్లకు గోపాలకృష్ణ ఆదర్శం

ABN , Publish Date - Jun 14 , 2025 | 05:01 AM

విశ్రాంత ఐఏఎస్‌ ఎం.గోపాలకృష్ణ నేటి తరం సివిల్‌ సర్వెంట్లకు ఆదర్శమని ఏపీ భవన్‌ స్పెషల్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఏపీ భవన్‌ ఆడిటోరియంలో గోపాలకృష్ణ రాసిన...

Arja Srikanth: నేటితరం సివిల్‌ సర్వెంట్లకు గోపాలకృష్ణ ఆదర్శం

ఏపీ భవన్‌ స్పెషల్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌

న్యూఢిల్లీ, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): విశ్రాంత ఐఏఎస్‌ ఎం.గోపాలకృష్ణ నేటి తరం సివిల్‌ సర్వెంట్లకు ఆదర్శమని ఏపీ భవన్‌ స్పెషల్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఏపీ భవన్‌ ఆడిటోరియంలో గోపాలకృష్ణ రాసిన ‘లైఫ్‌ ఆఫ్‌ ఏ కర్మయోగి’ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ... ‘86 ఏళ్ల వయస్సులోనూ గోపాలకృష్ణ సమాజహితం కోరుతూ రోజుకు 12 గంటలు కష్టపడుతున్నారు. ఉమ్మడి ఏపీలో విధులు నిర్వర్తించి విప్లవాత్మక కార్యక్రమాలు ప్రవేశపెటారు. గోదావరి ఫెర్టిలైజర్స్‌ను బలోపేతం చేయడంతో పాటు, ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను లాభాల బాటలో నడిపించారు’ అని తెలిపారు.

Updated Date - Jun 14 , 2025 | 05:01 AM