త్రివర్ణ పతాక రెపరెపలు
ABN , Publish Date - May 17 , 2025 | 01:31 AM
కాకినాడ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదులకు, పాకి స్తాన్కు ఆపరేషన్ సిందూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ కళాలకు సంఘీభావంగా శుక్రవారం సాయంత్రం కాకి నాడ నగరంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ విజయవంతమైం ది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ

కాకినాడలో తిరంగ ర్యాలీ విజయవంతం
కాకినాడ సిటీ, మే 16 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాదులకు, పాకి స్తాన్కు ఆపరేషన్ సిందూర్ ద్వారా గుణపాఠం చెప్పిన భారత త్రివిధ కళాలకు సంఘీభావంగా శుక్రవారం సాయంత్రం కాకి నాడ నగరంలో నిర్వహించిన తిరంగ ర్యాలీ విజయవంతమైం ది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్వర్యంలో చేపట్టిన ఈ ర్యాలీ మెయిన్రోడ్ టూటౌన్ సెంటర్ నుంచి బాలాజీచెరువు సెంటర్ వరకు కొనసాగింది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్, పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షు డు జ్యోతుల నవీన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వ రరావు అతిథులుగా పాల్గొన్నారు. వంద అడుగుల జాతీయ జెండాను ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఓపెన్ టాప్ జీపుపై సైని కులు, భరతమాత వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచా రు. మాజీ సైనికులను సత్కరించారు. పెద్ద సంఖ్యలో కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొని జాతీయ జెండాలను పట్టుకుని దేశ భక్తి చాటారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూ డి వీరు, బీజేపీ మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, కూటమి నాయకులు పెంకే శ్రీనివాసబాబా, పంతం సం దీప్, కొల్లాబత్తుల అప్పారావు, నల్లూరి శ్రీనివాస్, ఏవీడీ మెం టారావు, జొన్నాడ వెంకటరమణ, తుమ్మల కొండలరావు, కొక్కి లగడ్డ గంగాధర్, తుమ్మల సునీత, సాలగ్రామ లక్ష్మీప్రసన్న, గోడి సత్యవతివెంకట్, పాలిక నాని, పొంగా బుజ్జి, అధిక సంఖ్యలో కూటమి శ్రేణులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.