Share News

రూ.9.60కోట్లతో ఇండస్ట్రీయల్‌ పార్క్‌

ABN , Publish Date - May 11 , 2025 | 12:34 AM

జగ్గంపేట రూరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): జగ్గంపేట గోకవరం రోడ్డులో ఇండస్ట్రీయల్‌ పారిశ్రామిక నూతన భవనానికి శనివారం ఏపీఐఐసీ చైర్మన్‌ మం తెన రామరాజు, ఎమ్మె ల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండ స్ట్రీయల్‌ పాలసీని తీసు కొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటివిడతగా 39 నియోజకవర్గాల్లో ఇండస్ట్రీయల్‌ పార్క్‌లను ఏర్పాటుచేస్తుంది. దీనిలో భాగంగా జగ్గంపేటలో కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.9.60 కోట్లు

రూ.9.60కోట్లతో ఇండస్ట్రీయల్‌ పార్క్‌
జ్యోతి ప్రజల్వన చేస్తున్న మంతెన రామరాజు, జ్యోతుల నెహ్రూ

జగ్గంపేటలో శంకుస్థాపన

హాజరైన ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, ఎమ్మెల్యే నెహ్రూ

జగ్గంపేట రూరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): జగ్గంపేట గోకవరం రోడ్డులో ఇండస్ట్రీయల్‌ పారిశ్రామిక నూతన భవనానికి శనివారం ఏపీఐఐసీ చైర్మన్‌ మం తెన రామరాజు, ఎమ్మె ల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండ స్ట్రీయల్‌ పాలసీని తీసు కొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటివిడతగా 39 నియోజకవర్గాల్లో ఇండస్ట్రీయల్‌ పార్క్‌లను ఏర్పాటుచేస్తుంది. దీనిలో భాగంగా జగ్గంపేటలో కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.9.60 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింద ని మంతెన రామరాజు తెలిపారు. 15రోజుల్లో టెండర్లు పిలుస్తామని, 6 నెలల్లో ఈ కాంప్లెక్స్‌ నిర్మాణంపూర్తి చేయవలసి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇం డస్ట్రీయల్‌ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, అనేక మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలకు రాబోయే రోజులు సువర్ణ యుగమన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నారన్నారు. ఇక్కడ కాంప్లెక్స్‌ 5ఎకరాల్లో నిర్మితమవుతుందన్నారు. సుమారు పారిశామ్రిక 20హాళ్లను నిర్మిస్తున్నట్లు వివరించారు. ఈ భవనంలో మొట్టమొదటిగా ఐటీఐ ప్రో సర్వీసెస్‌ ఏర్పాటుచేయడానికి గోనాడ గ్రామానికి చెందిన నీలం అచ్యుత ముందుకువచ్చారని తద్వారా 200మంది వరకు ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జోనల్‌ మేనేజర్‌ రమణారెడ్డి, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ బి.పద్మజాదేవి, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ బి.రాదామని, తహశీల్దార్‌ రమేష్‌, ఎంపీడీవో ఎం.చంద్రశేఖర్‌, బీజేపీ ఇన్‌చార్జ్‌ దాట్ల కృష్ణవర్మ, మారిశెట్టి భద్రం, ఎస్వీఎస్‌ అప్పలరాజు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 12:34 AM