అశేష భక్తజనమయం...సత్యదేవుని రథోత్సవం
ABN , Publish Date - May 12 , 2025 | 12:33 AM
అన్నవరం, మే 11 ( ఆంధ్రజ్యోతి): సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాల్లో నిర్వహించే గ్రామసేవల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం కనుల పండుగగా జరిగింది. సాయం త్రం 4గంటలకు నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను రూ.1.20 కోట్లతో తయారుచేయించిన నూతన టేకురథంపై ఆశీనులు గావించారు. చైర్మన్ ఐవీ రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు టెంకాయి కొట్టి రఽఽథోత్సవం ప్రారంభించారు.

అన్నవరం, మే 11 ( ఆంధ్రజ్యోతి): సత్యదేవుని వార్షిక కల్యాణోత్సవాల్లో నిర్వహించే గ్రామసేవల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం కనుల పండుగగా జరిగింది. సాయం త్రం 4గంటలకు నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను రూ.1.20 కోట్లతో తయారుచేయించిన నూతన టేకురథంపై ఆశీనులు గావించారు. చైర్మన్ ఐవీ రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు టెంకాయి కొట్టి రఽఽథోత్సవం ప్రారంభించారు. రథానికి కుంభం పోసి ముందుకు కదిలించారు. తొలిపావంచా వద్ద నుంచి ప్రారంభమైన రఽఽథోత్సవం మంగళవాయిద్యాలు, పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆంధ్రాబ్యాంక్ వరకు వెళ్లి అక్కడ నుంచి సత్యదేవుడి కొండపైకి వెళ్లే టోల్గేట్ వరకు కొనసాగి తిరిగి కాంప్లెక్స్ వద్ద నూతనంగా ప్రారంభించిన రథశాల వద్ద ముగిసింది. అశేష భక్తజనంతో అన్నవరం మెయిన్రోడ్డు జనసందోహాన్ని తలపించింది. దేవస్థానం ఉద్యోగులు యావన్మంది రథోత్సవంలో పాల్గొనాలని ఈవో ఆదేశాలు జారీచేయడంతో ప్రతిఒక్క ఉద్యోగి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 3500 కిలోల బరువుతో సుమారు 35 అడుగులుపొడవు కలిగిన ఈ రథం లాగేందుకు సుమారు 50 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, నాయీబ్రాహ్మణులు 50మందితో పాటుగా ముందుభాగంలో ట్రాక్టర్, వెనకభాగంలో జెసీబీ సాయంతో ఇబ్బంది లేకుండా ముందుకు కదిలించారు. ఈఈ రామకృష్ణ, ఏఈవో కొండలరావు మైక్ ద్వారా సూచనలిస్తూ కార్యక్రమం కొనసాగించారు. వాహనాలను బైపాస్ మీదుగా మళ్లించారు. ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు పర్యవేక్షణ లో సుమారు 50మంది బందోబస్తు నిర్వహించారు.
నయనానందకరంగా వనవిహారం
సత్యదేవుడి కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం వనవిహార మహోత్సవం నయనానందకరంగా జరిగింది. నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను కొండపై నుంచి పల్లకీలో కొండదిగువున ఉన్న ఉద్యానవనానికి తీసుకుకొచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెండి సింహాసనంపై నవదంపతులను, మరో వేదికపై పెళ్లి పెద్దలైన సీతారాములను ఆశీనులు గా వించారు. గణపతిపూజ, పుణ్యాహవచనం అ నంతరం చతు ర్వేదపండితుల వేదాశీర్వచనం అనంతరం కొండపైకి తీసుకెళ్లారు.