నేటి నుంచే సత్యదేవుని దివ్యకల్యాణోత్సవాలు
ABN , Publish Date - May 07 , 2025 | 12:22 AM
అన్నవరం, మే 6 (ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదాయుడు అన్నవరం సత్యదేవుడు వరుడవుతున్న వేళ రత్న,సత్యగిరులు పులకించిపోతున్నాయి. శ్రీవిశ్వావసు నామ సం వత్సర వార్షిక కల్యాణోత్సవాలు బుధవారం నుం చి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు సాయం త్రం 4 గంటలకు అ

తొలిరోజు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా అలంకరణ
శరవేగంగా ఏర్పాట్లు ఫ పరిశీలించిన కాకినాడ జిల్లా ఎస్పీ
అన్నవరం, మే 6 (ఆంధ్రజ్యోతి): కోరిన కోర్కెలు తీర్చే భక్తవరదాయుడు అన్నవరం సత్యదేవుడు వరుడవుతున్న వేళ రత్న,సత్యగిరులు పులకించిపోతున్నాయి. శ్రీవిశ్వావసు నామ సం వత్సర వార్షిక కల్యాణోత్సవాలు బుధవారం నుం చి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు సాయం త్రం 4 గంటలకు అనివేటి మండపంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను పండితులు పెళ్లికొడుకు, పెళ్లికూతురుగా అలంకరించి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అనివేటి మండపం వద్ద ప్రత్యేక అలంకరణలు చేపడుతున్నారు. మంగళవారం సాయంత్రం కల్యాణవేదికను కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ప్రత్తిపాడు సీఐ సూరి అప్పారావు పరిశీలించారు. ప్రముఖులు, సామాన్యుల గ్యాలరీలను పరిశీలించి సూచనలు చేశారు. భక్తులు ఎక్కువగా వస్తుండడంతో ఎటువంటి దొంగతనాలు, అవాంఛనీయ సంఘటన లు జరగకుండా ప్రత్యేక చర్యలు అదనపు సీసీ కెమెరాలతో నిఘా పెంచినట్టు డీఎస్పీ తెలిపారు. సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రముఖుల వాహనాలు, ఫైర్ ఇంజన్, అంబు లెన్స్లు మాత్రమే తూర్పురాజగోపురం పార్కింగ్ వద్ద నిలపనున్నారు. భారీవాహనాలను కొండదిగువున కళాశాల మైదానంలో ఉంచి దేవస్థానం, ప్రయివేట్ బస్సుల్లో భక్తులను కొండపైకి తీసుకెళ్లనున్నట్టు ఈవో వివరించారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్ రామ్మోహనరావు, ఏఈ వోలు, ఇంజనీరింగ్ అధి కారులు పాల్గొన్నారు. కోన సీమ జిల్లా మండపేటకు చెందిన ఒక భక్తుడు ప్రత్యేక అలంకరణతో తయారుచేయించిన కొబ్బరిబొండాలను స్వామివారి కల్యాణానికి వినియోగించాలని కోరారు. దివ్యకల్యాణం సందర్భంగా దేవస్థానం కొండపై, కొండదిగువున ఏర్పాటుచేసిన విద్యుద్దీపఅలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఐపీఎస్ అధికారుల పూజలు
సత్యదేవుని సన్నిధిలో మంగళవారం రాత్రి ఐపీఎస్ అధికారులు డైరక్టర్ జనరల్ అంజనీకుమార్, జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్, కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ప్రత్యేకపూజలు నిర్వహించారు. వారికి ఈవో వీర్ల సుబ్బారావు ఆలయ మ ర్యాదలతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. సత్యదేవుడి జన్మనక్షత్రం మఖ సందర్భంగా మంగళవారం ప్రత్యేకపూజలు జరిగాయి.