CBN Review: సీఎస్, డీజీపీ, వివిధ శాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష
ABN , Publish Date - May 07 , 2025 | 08:03 PM
ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు రాజధాని అమరావతిలో సమీక్ష

CM Chandrababu review: ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్, వైద్య ఆరోగ్య, పర్యాటక, దేవదాయ, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇక, ఆన్ లైన్ విధానంలో రివ్యూకు హాజరయ్యారు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రైల్వే, ఇండియన్ ఆర్మీ, నావీ, ఎయిర్ పోర్స్, సీఐఎస్ఎఫ్ అధికారులు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, సన్నద్దతపై చర్చించారు.
మాక్ డ్రిల్స్ నిర్వహణ, పరిస్థితులపై ప్రజలకు అవగాహణ కల్పించడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఊహించని ఘటనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు.