MLCs Take Oath: ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Apr 17 , 2025 | 06:01 AM
అమరావతిలో బీద రవిచంద్ర, గాదె శ్రీనివాసులు నాయుడు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ప్రమాణం చేయించారు

అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): శాసన మండలికి ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బీద రవిచంద్ర, గాదె శ్రీనివాసులు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. అమరావతిలోని శాసన సభ భవనంలో మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వారితో ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీల కుటుంబ సభ్యులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.