Share News

Electricity Regulatory Commission: బీఈఎస్ఎస్‌కు ఈఆర్‌సీ గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:59 AM

రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్ఎస్‌)ను అమలు చేసేందుకు విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది.

Electricity Regulatory Commission: బీఈఎస్ఎస్‌కు ఈఆర్‌సీ గ్రీన్‌ సిగ్నల్‌

  • నోడల్‌ ఏజెన్సీగా ఏపీ ట్రాన్స్‌కో

అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్ఎస్‌)ను అమలు చేసేందుకు విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పవర్‌ సిస్టమ్‌ డెవల్‌పమెంట్‌ ఫండ్‌ (పీఎ్‌సడీఎఫ్‌) కింద నిధులు వ్యయం చేసేందుకు కూడా ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీఈఆర్‌సీ ఉత్తర్వు జారీ చేసింది. సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో పగటి పూట ఉత్పత్తి అయిన విద్యుత్తును రాత్రి సమయంలోనూ వినియోగించుకునేందుకు వీలుగా బ్యాటరీ స్టోరేజీ విధానాన్ని వాడుకోవాలని కేంద్ర ఇంధన శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ నిర్ణయించింది. ప్రధానంగా గిరిజన తండాల్లో సౌర విద్యుత్తును బ్యాటరీలో నిక్షిప్తం చేసి రాత్రి సమయంలో వాడుకునే పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు ఇప్పటికే కార్యాచరణను రూపొందించాయి. ఈ కార్యచరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును పరిశీలించిన ఈఆర్‌సీ... వయబిలిటీ గ్యాఫ్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) కింద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌కు నిధులు వ్యయం చేసుకోవచ్చంటూ ఏపీ ట్రాన్స్‌కోకు అనుమతి ఇచ్చింది. నోడల్‌ ఏజెన్సీగా ఏపీ ట్రాన్స్‌కో బీఈఎ్‌సఎస్‌ కోసం టెండర్లను పిలవనుంది.

Updated Date - Aug 03 , 2025 | 06:00 AM