అయ్యర్‌ను వదలని శని..  ఎందుకిలా జరుగుతోంది?

స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మరో ట్రోఫీని చేజార్చుకున్నాడు.

పంజాబ్ కింగ్స్‌కు సారథిగా వ్యవహరించిన అయ్యర్.. ఐపీఎల్-2025లో ఫైనల్స్ వరకు జట్టును తీసుకొచ్చినా కప్పును అందించలేకపోయాడు.

ఆఖరి పోరులో ఆర్సీబీ చేతుల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది పంజాబ్ జట్టు.

ఇప్పుడు అయ్యర్ కెప్టెన్సీలో మరో టీమ్ కప్ మిస్ చేసుకుంది.

టీ20 ముంబై-2025 టోర్నీలో అయ్యర్ సారథిగా ఉన్న సోబో ముంబై ఫాల్కన్స్ ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. 

ముంబై సౌత్ సెంట్రల్ మరాఠా రాయల్స్‌‌తో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది అయ్యర్ సేన.

అయ్యర్ టీమ్ ఓటమిపై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడికి శని పట్టుకుందని, వరుస ట్రోఫీలు మిస్ చేసుకోవడానికి అదే కారణమని అంటున్నారు.