గుండె పగిలింది..  విమాన ప్రమాదంపై క్రికెటర్ల రియాక్షన్!

అహ్మదాబాద్ నుంచి లండన్‌ బయలుదేరిన ఎయిరిండియా విమానం కూలిపోయింది.

టేకాఫ్ అయిన కాసేపటికే విమానాశ్రయానికి దగ్గర్లోని మేఘానీనగర్‌లో ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడిపోయింది.

ఈ విషాద ఘటనలో విమానంలోని 242 మంది ప్రాణాలు కోల్పోయారు.

తీవ్రంగా కలచివేసిన ఈ ఘటనపై స్టార్ క్రికెటర్లు స్పందిస్తున్నారు.

ఇది కలతపెట్టే వార్త అని.. బాధిత కుటుంబాలకు ధైర్యం చేకూరాలని కోరుకుంటున్నట్లు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

ప్రమాదం వార్త విని షాక్ అయ్యానని.. బాధితులందరికీ ప్రగాఢ సానుభూతి అని టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పోస్ట్‌లో రాశాడు.

ఈ ఘటన గురించి విని గుండె పగిలిందని టర్బనేటర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఆఫ్ఘాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.