ఇంచు భూమినీ లాక్కోలేరు.. గవాస్కర్ వార్నింగ్

పహల్గాం అటాక్ మీద క్రికెట్ దిగ్గజం సునీల్ గవార్కర్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. 

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు.

టెర్రరిస్టులతో పాటు వాళ్లకు మద్దతుగా నిలిచే వారికి గవాస్కర్ ఓ సూటి ప్రశ్న వేశాడు. 

78 ఏళ్లలో టెర్రరిస్టులు, వాళ్ల మద్దతుదారులు సాధించింది ఏమీ లేదన్నాడు.

ఇన్నేళ్లలో ఒక మిల్లీమీటర్ భూమినైనా కదిపారా అంటూ పాక్‌పై సెటైర్లు వేశాడు గవాస్కర్. 

వచ్చే 78 వేల సంవత్సరాల తర్వాతా ఇందులో మార్పూ ఉండబోదన్నాడు. 

ప్రశాంతంగా జీవించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని దుయ్యబట్టాడు గవాస్కర్.