గిల్ సేనకు కొత్త టెన్షన్..  అంత ఈజీ కాదు బ్రో!

ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం రెడీ అవుతోంది టీమిండియా. ఇంకో వారం రోజుల్లో ఈ సిరీస్ స్టార్ట్ కానుంది.

రోహిత్, విరాట్ గైర్హాజరీలో ఆడుతున్న మొదటి టెస్ట్ సిరీస్‌ కావడంతో టీమిండియాకు ఇది కఠిన పరీక్షగా నిలవనుంది.

గంభీర్-గిల్‌కు నయా టెన్షన్ మొదలైంది. సాయి సుదర్శన్‌ను ఏ స్పాట్‌లో ఆడించాలనేది అర్థం కావడం లేదట.

డెబ్యూ ప్లేయర్ కాబట్టి రెగ్యులర్ స్పాట్ అయిన  ఓపెనింగ్‌లోనే ఆడించాలని గంభీర్ భావిస్తున్నాడట. అదే జరిగితే జైస్వాల్ నంబర్‌ 3లో ఆడాల్సి ఉంటుంది.

సాయి సుదర్శన్ కోసం జైస్వాల్ త్యాగం చేస్తాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఓపెనింగ్ జోడీని ఫిక్స్ చేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారిందని సమాచారం.

ఓపెనింగ్‌ను సెట్ చేస్తే బ్యాటింగ్ యూనిట్ మొత్తం కుదురుకుంటుంది. సరైన ఆరంభాలు లభిస్తే జట్టుకు తిరుగుండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.