భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది.
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ధోనీకి చోటు దక్కింది. ఈ మేరకు ఐసీసీ కీలక ప్రకటన చేసింది.
మాహీ ఆధ్వర్యంలో టీమిండియా 2 ఐసీసీ వరల్డ్ కప్లు (2007 టీ0, 2011 వన్డే) అందుకుంది. అతడి కెప్టెన్సీలో 2013 చాంపియన్స్ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది.
ధోనీ నాయకత్వంలోనే భారత జట్టు 2009లో టెస్టుల్లో అగ్రపీఠాన్ని కైవసం చేసుకొని ఔరా అనిపించుకుంది.
అన్ని ఫార్మాట్లలో కలిపి 538 మ్యాచ్లు, 17,266 పరుగులు, కీపర్గా 829 మందిని ఔట్ చేశాడు ధోని. అలాంటోడ్ని ప్రశంసల్లో ముంచెత్తింది ఐసీసీ.
ధోనీతో పాటు హేడెన్ (ఆస్ట్రేలియా), ఆమ్లా, గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా), వెటోరి (న్యూజిలాండ్), సనా మిర్ (పాకిస్థాన్), సారా టేలర్ (ఇంగ్లండ్)కూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం దక్కింది.
హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం దక్కించుకున్న 11వ భారత క్రికెటర్గా నిలిచాడు ధోని. గవాస్కర్, సచిన్, సెహ్వాగ్, ఎడుల్జీ, కుంబ్లే, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, ద్రవిడ్, వినూ మన్కడ్, నీతూ డేవిడ్ పేర్లు ఇప్పటికే ఈ లిస్ట్లో ఉన్నాయి.