నా కొడుకు జోలికొస్తే ఊరుకోను..  బుమ్రా భార్య సీరియస్

 కుమారుడు అంగద్‌పై ట్రోలింగ్ చేస్తున్న వారి మీద బుమ్రా సతీమణి సంజనా గణేషన్ సీరియస్ అయింది. 

 మ్యాచ్ చూసేందుకు గ్రౌండ్‌కు వచ్చామని.. వైరల్ కంటెంట్‌గా మారే ఉద్దేశం లేదని చెప్పింది. 

అంగద్ గురించి కామెంట్స్ చేసేవారికి అతడి గురించి అసలు ఏమీ తెలియదంటూ సీరియస్ అయింది సంజన. 

ఎవర్నో ఎంటర్‌టైన్ చేయడానికి తన కొడుకు లేడంటూ ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిపడేసింది బుమ్రా భార్య. 

బుమ్రాకు సపోర్ట్ చేసేందుకు స్టేడియానికి వచ్చామని క్లారిటీ ఇచ్చింది. 

సంజన-అంగద్ హాజరైన లక్నోతో మ్యాచ్‌లో ముంబై విక్టరీ కొట్టింది. 

బుమ్రా 4 వికెట్లతో ఎంఐ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.