అప్పుడు కోహ్లీ, ఇప్పుడు రొనాల్డో..  సేమ్ టు సేమ్!

పోర్చుగల్ రెండో యూఈఎఫ్‌ఏ నేషన్స్ లీగ్ టైటిల్‌‌ను సొంతం చేసుకుంది.

సండే ఫైట్‌లో 5-3 గోల్స్ తేడాతో స్పెయిన్‌ను ఓడించింది పోర్చుగల్.

టీమ్ విక్టరీతో స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో సంతోషం పట్టలేక ఎమోషనల్ అయిపోయాడు.

మ్యాచ్ ముగియగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు రొనాల్డో. దీంతో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో అతడ్ని పోలుస్తున్నారు.

ఐపీఎల్-2025 ట్రోఫీని కైవసం చేసుకోవడంతో కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

18 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న కప్పు రావడంతో కోహ్లీ సంతోషం పట్టలేక ఏడ్చేశాడు.

కోహ్లీ-రొనాల్డోలను కంపేర్ చేస్తూ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ఒకేలా ఎమోషనల్ అయ్యారని నెటిజన్స్ చెబుతున్నారు.