ఈ విజయం ఆమెకు అంకితం..  ఆకాశ్‌దీప్ ఎమోషనల్!

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో 336 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది భారత జట్టు.

అన్ని విభాగాల్లోనూ ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన గిల్ సేన.. ఆతిథ్య జట్టును చావుదెబ్బ తీసింది.

స్పీడ్‌స్టర్ ఆకాశ్‌దీప్ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు ఆకాశ్‌దీప్.

ఈ ప్రదర్శనను తన సోదరి జ్యోతి సింగ్‌కు అంకితం చేశాడు ఆకాశ్‌దీప్.

ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోందని మ్యాచ్ అనంతరం వెల్లడించాడు ఆకాశ్‌దీప్.

తన సోదరి క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటోందని, ఆమె ఆరోగ్యం ఇప్పుడు మెరుగ్గా ఉందన్నాడు యువ పేసర్.