రుద్రాక్ష శివుడికి  చాలా ప్రియమైనది.

రుద్రాక్ష ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది

శివుని ఆశీర్వాదం పొందడానికి ప్రజలు రుద్రాక్షలను ధరిస్తారు.

పురాణాల ప్రకారం త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.అతను భూమిపై భయాన్ని సృష్టించాడు

త్రిపురాసురుడిని ఓడించడంలో దేవతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు.

దేవతలు శివుని వద్దకు చేరుకున్న.. సమయంలో శివుడు యోగాసనంలో ధ్యానంలో మునిగి ఉన్నాడు.

మహా దేవుడి తపస్సు పూర్తయిన తర్వాత అతని కళ్ళ నుంచి కన్నీళ్ళు భూమిపై పడ్డాయి.

హిందూ విశ్వాసాల ప్రకారం శివుని కన్నీళ్లు ఎక్కడ పడ్డాయో అక్కడ రుద్రాక్ష వృక్షాలు పెరిగాయి.

రుద్రాక్షలు శివుని కన్నీళ్ల నుంచి ఉద్భవించాయి. మహాదేవుడు త్రిపురాసురుడిని సంహరించాడు.

రుద్రాక్షలలో 14 రకాలు ఉన్నాయి. అమావాస్య, పౌర్ణమి, శ్రావణ మాసం సోమవారం, ప్రదోష ఉపవాసం చేసే సమయంలో రుద్రాక్షను ధరించాలని నమ్ముతారు.