హిందూ ధర్మంలో దీపారాధకు  ఎంతో విశిష్టత ఉంది.

పండగలు, వ్రతాలు, శుభకార్యలు ఇలా ఎన్నో సందర్భాల్లో దీపం వెలిగిస్తాం

"దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః, దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః" అంటుంటారు.

చిన్నపిల్లలు ఎవరైనా సరే మూడు అంగుళాల ఎత్తున్న కుందుల్లో దీపం వెలిగించాలని చెబుతున్నారు.

30 సంవత్సరాల లోపు వివాహం కానీ యువకులు, యువతులు మూడు నుంచి ఆరు అంగుళాల ఎత్తున్న ప్రమిదలు ఉపయోగించొచ్చని వివరిస్తున్నారు.

వివాహం జరిగిన వారు, మధ్య వయసులో ఉన్నవారు కూడా 3 నుంచి 6 అంగుళాల ఎత్తు కలిగిన కుందులు వాడొచ్చని సూచిస్తున్నారు.

వయసు పెరిగిన వారు అంటే 50 సంవత్సరాల పైన ఉన్నవారు 6 నుంచి 9 అంగుళాల కుందుల్లో దీపారాధన చేయాలని వివరిస్తున్నారు.

వయసు పెరిగే కొద్దీ దీపరాధన కుందుల సైజ్​ పెరిగితే అనుకూల ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు.