అమరవీరుల దినోత్సవాన్ని  ఎందుకు జరుపుకొంటారు.. 

మన దేశంలో మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.

స్వాతంత్ర్య పోరాటంలో 1931 మార్చి 23న, బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులను ఉరితీసింది.

వారి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ యావ‌త్ భార‌తం ష‌హీద్ దివ‌స్ జ‌రుపుకుంటుంది. 

ఈ ముగ్గురు ధైర్యవంతులైన దేశ కుమారుల గౌరవార్థం ప్రతి సంవత్సరం మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 

భగత్ సింగ్, అతని సహచరులు వంటి విప్లవ జాతీయవాదులు కార్మికులు, రైతుల విప్లవం ద్వారా వలస పాలనకు, ధనిక దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుకున్నారు.

మార్చి 23తో పాటూ మహాత్మా గాంధీ హత్యకు గురైన రోజు జనవరి 30న కూడా షహీద్ దివస్‌గా పాటిస్తారు.

భగత్ సింగ్ ముందే ఊహించినట్లుగానే బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్‌, రాజ్‌గురులను మార్చి 23వ తేదీన ఉరితీసింది.

" అమరవీరుల త్యాగాలు వృధా కావు వారి ఆత్మలు వారు పోరాడిన ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ నివసిస్తాయి." - సుభాష్ చంద్రబోస్

“ఒక అమరవీరుడి రక్తం స్వేచ్ఛకు బీజం.” – డాక్టర్ బిఆర్ అంబేద్కర్

"దేశం పట్ల ప్రేమకు అత్యున్నత వ్యక్తీకరణ బలిదానం." - సరోజిని నాయుడు

 "వారు మనల్ని చంపవచ్చు, కానీ వారు మన ఆదర్శాలను ఎప్పటికీ చంపలేరు." - మహాత్మా గాంధీ

"స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరచిపోలేము." - జవహర్‌లాల్ నెహ్రూ