అమరావతిలో
మళ్లీ సింగపూర్ నిర్మాణాలు..
సింగపూర్లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం భేటీ అయ్యింది.
ఈ సమావేశం సింగపూర్తో ఆంధ్రప్రదేశ్ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలకమైన అడుగుగా భావించవచ్చు.
సింగపూర్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని హైకమిషనర్ వెల్లడించారు.
ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్కు సింగపూర్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కాయని, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటవుతోందని సీఎం తెలిపారు.
అమరావతిలో ఇండియా క్వాంటం మిషన్లో భాగంగా క్వాంటం వ్యాలీ కూడా ఏర్పాటు కానుందని వెల్లడించారు.
రాయలసీమ ప్రాంతం డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలకు
అనువైన ప్రాంతంగా
మారుతుందని సీఎం చెప్పారు.
సింగపూర్ నుంచి ఇండియాకు ముఖ్యంగా ఏపీకి పెట్టుబడులు రావాలని, ఈ పెట్టుబడులకు ఏపీ గేట్వేగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Related Web Stories
హంద్రీ నీవాకు నీరు విడుదల చేసిన చంద్రబాబు..
ఒక్క ప్రూఫ్ చూపించండి.. అజిత్ డోభాల్ చాలెంజ్!
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో పీటీఏం 2.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్
మీ జోక్యం అక్కర్లేదు.. అమెరికాకు చైనా వార్నింగ్!