15 లక్షల సైబర్ అటాక్స్..  ఆగని పాక్ కుట్రలు 

భారత్‌ను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది పాకిస్థాన్. 

కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తూ సరిహద్దుల్లో మన జవాన్లపై కాల్పులకు తెగబడుతోంది శత్రుదేశం.

ఇండియా మీద భారీస్థాయిలో సైబర్ అటాక్స్‌కు కుట్రలు పన్నుతోంది. 

 పహల్గాం అటాక్ అనంతరం పాక్ హ్యాకర్లు భారత్‌లో ఏకంగా 15 లక్షల సైబర్ అటాక్స్ జరిపారని తేలింది. 

ఈ సైబర్ అటాక్స్‌లో 150 వరకు సక్సెస్ అయ్యాయని.. సీజ్‌ఫైర్ తర్వాతా ఈ దాడులు ఆగలేదని మహారాష్ట్ర సైబర్ డీబంక్డ్‌కు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. 

మాల్వేర్ క్యాంపైన్స్, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్, జీపీఎస్ స్పూఫింగ్ లాంటి సైబర్ అటాక్స్ అధికంగా జరుగుతున్నాయని చెప్పారు. 

భారత సర్కారుకు చెందిన వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది శత్రుదేశం.

పాక్‌తో పాటు బంగ్లాదేశ్, ఇండోనేషియా, మొరాకో నుంచీ ఇండియాపై సైబర్ దాడులు జరుగుతున్నాయి.