పరువు తీసుకున్న పాక్ ప్రధాని..
తల ఎక్కడ పెట్టుకుంటారో..
పాక్ ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చారా దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్.
మిసైళ్లు, డ్రోన్లతో భారత్ తమపై దాడి చేసిందన్నది నిజం కాదంటూ బుకాయిస్తూ వచ్చిన షెహబాజ్ షరీఫ్.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు.
నూర్ ఎయిర్ బేస్పై ఇండియా మిసైల్ అటాక్ నిజమేనని పాక్ ప్రధాని స్వయంగా చెప్పారు.
నూర్ ఖాన్ ఎయిర్బేస్పై ఓ మిసైల్ పడిందని జనరల్ అసిఫ్ మునిర్ తనకు ఫోన్ చేసి చెప్పాడని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.
ఇతర ప్రాంతాల్లోనూ మిసైళ్లు పేలాయని అసిఫ్ మునిర్ చెప్పారని పాక్ ప్రధాని వెల్లడించారు.
షెహబాజ్ షరీఫ్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మాళవ్య ట్విట్టర్లో షేర్ చేశారు.
పాక్ ప్రధాని స్వయంగా భారత దాడిని ఒప్పుకోవడంతో ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు.
Related Web Stories
15 లక్షల సైబర్ అటాక్స్.. ఆగని పాక్ కుట్రలు
ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం
S 400 రక్షణ కవచం.. ఎవరెవరి దగ్గర ఉందంటే..
ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆర్మీ ఆఫీసర్ ఎవరు..