సినీ పరిశ్రమపై
మంత్రి కందుల దుర్గేష్
కీలక వ్యాఖ్యలు చేశారు.
సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
టికెట్ ధరల పెంపుపై దశాబ్దాలుగా
వివాదం కొనసాగుతోందని
పేర్కొన్నారు.
టికెట్ల రేట్లు పెంచాలని
నిర్మాతలు అడిగినప్పుడల్లా పెంచుతున్నామని స్పష్టం చేశారు
టికెట్ రేట్లు రూపాయి పెంచితే తమ ప్రభుత్వానికి పావలా జీఎస్టీ వస్తుందని చెప్పారు.
తమ సమస్య తామే పరిష్కరించుకుంటామని కొంతమంది
అహంభావంతో మాట్లాడుతున్నారని అన్నారు.
సినిమా థియేటర్ల అంశంపై
అల్లు అరవింద్ వ్యాఖ్యలు వాస్తవమని చెప్పారు.
పవన్కల్యాణ్ సినిమాపై మాజీ మంత్రి పేర్నినాని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
అదొక ప్లాప్ సినిమా అంటూ పేర్నినాని కామెంట్ చేయడం తగదని అన్నారు.
అదొక పోరాట యోధుడి సినిమా అని ఉద్ఘాటించారు.
ఆ చిత్రం విడుదలకు ముందే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
థియేటర్ల మూసివేత అంశంపై విచారణ జరపాలని చెప్పారు.
ఈ విషయాన్ని రాజకీయం చేసి కొందరు లబ్ధి పొందాలని చూస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు.
సినిమా రంగాన్ని తాము ఇబ్బంది పెడుతున్నట్లుగా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Related Web Stories
పరువు తీసుకున్న పాక్ ప్రధాని.. తల ఎక్కడ పెట్టుకుంటారో..
15 లక్షల సైబర్ అటాక్స్.. ఆగని పాక్ కుట్రలు
ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన ప్రభుత్వం
S 400 రక్షణ కవచం.. ఎవరెవరి దగ్గర ఉందంటే..