ఈ స్కూల్ చూస్తుంటే అసూయగా  ఉంది.. లోకేష్

 ఏపీ విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ నెల్లూరులో వీఆర్ మోడల్ హైస్కూల్‌ను ప్రారంభించారు.

6 నెలల క్రితం మూతపడిన పాఠశాలను అత్యాధునిక రీతిలో ఇంత వేగంగా తీర్చిదిద్దడం అద్భుతమని ప్రశంసించారు.

సౌత్ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్ మరొకటి ఉండదేమో అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు.

ఆరు నెలలు కిందట ఘోరమైన పరిస్థితిలో ఉన్న స్కూలు ఇప్పుడే చూస్తే ఆశ్చర్యంగానూ, అసూయగానూ ఉందని మంత్రి లోకష్ చమత్కరించారు.

వీఆర్ హైస్కూల్ క్రీడా మైదానం పరిశీలన సందర్భంగా సరదాగా క్రికెట్, వాలీబాల్ ఆడిన మంత్రి లోకేష్.

పాఠశాల ల్యాబ్ ను పరిశీలిస్తున్న మంత్రులు

లైబ్రరీలో పుస్తకాలను పరిశీలిస్తున్న మంత్రి

వీఆర్ హైస్కూల్లో విద్యార్థుల కోసం మినీ థియేటర్ ఏర్పాటు.

పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గాయకుడు ఎస్పీ బాలు వంటి వాళ్లు ఈ పాఠశాలలోనే చదివారని గుర్తు చేశారు.