అమరావతిలో చంద్రబాబు  ఇంటికి శంకుస్థాపన..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 

తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అమరావతి రాజధానిలోని వెలగపూడిలో కొత్త ఇంటి నిర్మాణానికి పూజలు చేస్తున్న చంద్రబాబు దంపతులు, ప్రక్కన మనుమడు దేవాన్ష్.

వేద పండితులు వారి చేత భూమి పూజ చేయించారు. సచివాలయం వెనుక ఈ6 (E6) రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు.

కాగా సీఎం చంద్రబాబు కుటుంబానికి పట్టువస్త్రాలు అందించాలని వెలగపూడి గ్రామస్తులు కోరుకుంటున్నారు.