ఏడాది పాలనపై ప్రజల్లో సానుకూలత: సీఎం చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై టీడీపీ నేతలతో చంద్రబాబు చర్చించారు.

కడపలో మహానాడు అద్భుతంగా జరిగిందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.  

మహానాడును సక్సెస్ చేసిన నేతలకు అభినందనలు, కార్యకర్తలకు హాట్సాఫ్ తెలిపారు.

జిల్లా నాయకత్వమంతా కలిసి పనిచేసి.. మహానాడును విజయవంతం చేసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడం సంతోషాన్ని ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజలతో నాయకులు మరింత మమేకమవ్వడం ద్వారా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై నిరంతరం చర్చించాలని సీఎం చంద్రబాబు కోరారు. 

తాను ప్రతి నెలా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడాకి కారణం కూడా అదేనని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. 

నాయకత్వం సమష్టిగా పనిచేస్తే ఏ కార్యక్రమమైనా సజావుగా జరుగుతుందని కడప మహానాడుతో నిరూపితమైందని సీఎం చంద్రబాబు చెప్పారు.

మంత్రులంతా కార్యకర్తల్లా పనిచేసి స్ఫూర్తినిచ్చారని  సీఎం చంద్రబాబు కొనియాడారు.

'నా తెలుగు కుటుంబం'లోని ఆరు శాసనాల కాన్సెప్ట్‌ను.. ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.

జూన్‌లోనే తల్లికి వందనం, అన్నదాత పథకాలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని వెల్లడించారు.

ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా త్వరలోనే క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.