ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతోంది: సీఎం చంద్రబాబు

తొలిసారి దేవునిగడప కడపలో మహానాడు జరుగుతుందని వ్యాఖ్యానించారు.

 కార్యకర్తల పోరాటాలతోనే అధికారంలోకి వచ్చామని అన్నారు.

ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని కొనియాడారు.

వైసీపీ పాలనలో పసుపు సింహం చంద్రన్నను దారుణంగా చంపారని మండిపడ్డారు.

కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.

రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ టీడీపీ అని అభివర్ణించారు.

 ప్రాంతీయ పార్టీగా పుట్టి.. జాతీయస్థాయిలో ఎదిగామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

పార్టీ పనైపోయిందన్నవారి పనే అయిపోయిందని చెప్పుకొచ్చారు.

ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలను మనం ఎదుర్కున్నామని అన్నారు.

నీతి, నిజాయితీకి టీడీపీ బ్రాండ్‌ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని చెప్పారు.

ఒక్కో ఇటుక పేరుస్తూ రాష్ట్రాన్ని నిలబెడుతున్నామని అన్నారు. 

తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పనిచేస్తుందని వ్యాఖ్యానించారు.

 కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. 

బీసీలను అధికారంలో భాగస్వాములం చేశామని  సీఎం చంద్రబాబు తెలిపారు.

కార్యకర్తల త్యాగాలను వృథా కానివబోమని అన్నారు.

తన పాదయాత్ర నుంచి లోకేష్‌ యువగళం వరకు కార్యకర్తల్లో అదే స్ఫూర్తి, అదే పోరాట పటిమ చూపిస్తున్నారని ప్రశంసించారు.

అన్ని ప్రాంతాలు, వర్గాల అభివృద్ధే టీడీపీ లక్ష్యమని ఉద్ఘాటించారు.

తెలుగు జాతి ముందు ఉండాలంటే.. టీడీపీ ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.