మాజీమంత్రి కేటీఆర్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు 

కేసీఆర్ నీడలో పనిచేస్తున్న వారు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.

తనకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ ప్రయోజనాలపై ముందు దృష్టి పెట్టాలని ఎమ్మెల్సీ కవిత హితవు పలికారు.

తాను అసలే మంచిదాన్ని కాదు.. నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు.

క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా.. ట్విట్టర్‌లో మెసేజ్‌లు సరిపోతాయా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

ఇంటి ఆడబిడ్డపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని అన్నారు.

తనను సీఎం రేవంత్‌రెడ్డి కోవర్టు అనడం సరైనదేనా అని నిలదీశారు ఎమ్మెల్సీ కవిత.

తాను లేఖ రాస్తే ఆయనకు వచ్చిన నొప్పేంటనీ ప్రశ్నించారు.

అసలు తాను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. 

తాను జైలుకెళ్లిన రోజే బీఆర్ఎస్‌, ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని చెప్పానని, అయితే రాజీనామా అవసరం లేదని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు.

తాను జైల్లో ఉన్నప్పుడే తనపై కుట్రలు మొదలయ్యాయని ఫైర్ అయ్యారు.

లీకు వీరులను పట్టుకోమంటే.. గ్రీకువీరుల్లా తనపై దండెత్తారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత.

తన జోలికి వస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు.

తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని స్పష్టం చేశారు.

తాను కేసీఆర్‌లా తిక్కదాన్ని.. ఏమున్నా ఫేస్‌ టు ఫేస్ చూసుకుంటానని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.