పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలని సీఎం చంద్రబాబు అన్నారు

రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు

మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు

మొన్నటి వరకు వనజీవి రామయ్యను చూశామని.. ఇప్పుడు నల్లమల పరిరక్షణ కోసం అంకారావు కృషి చేస్తున్నారని అన్నారు

ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటుతున్నామని తెలిపారు

రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతోందని అన్నారు

నాలుగు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37 శాతం గ్రీన్ కవర్ రావాల్సి ఉందన్నారు

కోటి మొక్కలు నాటి వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు

అడవిలో కార్చిచుల నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు

పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు