రూ.40 వేల లోపే విదేశీ శీతాకాల టూర్స్..? ఇవే బెస్ట్ 6 దేశాలు..!

శీతాకాలం వచ్చిందంటే చాలు మనసు ఒక్కసారిగా ట్రావెల్ మోడ్‌లోకి వెళ్తుంది.

చల్లని గాలి, పొగమంచులో మెరుస్తున్న పర్వతాలు, ప్రశాంతమైన బీచ్‌లు ఇవన్నీ మన ముందే నిలబడినట్టుంటాయి.

ఇలాంటి వేళ రూ.40వేల లోపే విదేశాలకు వెళ్లడానికి 6 అద్భుతమైన గమ్యస్థానాలు ఉన్నాయని మీకు తెలుసా..

హిమాలయాల చల్లని గాలి, కాఠ్మండూ వీధుల్లో హిందూ-బౌద్ధ సంస్కృతుల కలయిక, పొఖరా సరస్సు ఇవన్నీ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని చూపిస్తాయి.

భూటాన్‌ పర్వతాల మధ్యలో ఉన్న మఠాలు, సంప్రదాయ దుస్తుల్లో తిరిగే ప్రజలు ఒక సినిమా లాగా ఉంటాయి.

శ్రీలంకలో శీతాకాలంలో పర్యటించడం ద్వారా బీచ్‌లు, తేయాకు తోటలు, చారిత్రక ప్రదేశాలను ఆస్వాదించవచ్చు.

దుబాయ్ శీతాకాల వాతావరణం చాలా బాగుంటుంది. ఎడారి సఫారీలు, మెరీనా స్త్రోల్స్, బీచ్లను ఖర్చు లేకుండా ఆస్వాదించొచ్చు.

ఆహ్లాదకరమైన అనుభవాలు పంచే ఉత్తమ గమ్యస్థానాల్లో బ్యాంకాక్‌ ఒకటి. ముఖ్యంగా డిసెంబర్-జనవరి నెలల్లో అక్కడి వాతావరణం మరింత సుందరంగా ఉంటుంది.

ఈ దేశాలు మీ బడ్జెట్‌ను దాటకుండా, మీ ట్రావెల్ అనుభవాన్ని మాత్రం ఆకాశంలోకి తీసుకెళ్తాయి