వేసవి మామిడి పండ్ల  సీజన్‌ వచ్చేసింది.

ఈ రుచికరమైన పండ్లను ఆస్వాదించడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు

మామిడి పండుతో కలిపి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తినటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు

మామిడి పండును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. కానీ కొందరు దీన్ని పెరుగుతో కలిపి తింటారు.

ఈ రెండు కలయికలు కలిసినప్పుడు శరీరంలో విష పదార్థాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి శరీరంలో వేడిని కలిగిస్తుంది.

పెరుగు చల్లదనాన్ని ఇస్తుంది. ఈ రెండు లక్షణాలు శరీరంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

దీనివల్ల జీర్ణవ్యవస్థలో సమస్య, చర్మంలో అలెర్జీ వస్తుంది. కాబట్టి మామిడి తిన్న తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత పెరుగు తినడం మంచిది.

మామిడి పండ్లను సిట్రస్ పండ్లు, పుల్లని రుచి కలిగిన వాటిని కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

మామిడి శరీరంపై వేడి ప్రభావాన్ని చూపుతుంది. దానిని పెరుగుతో కలిపి తీసుకోవడం మంచిది కాదు. అలా తినకండి, ఎందుకంటే అది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.