పిల్లలమర్రికి మిస్ వరల్డ్ సుందరీమణులు
ABN, Publish Date - May 15 , 2025 | 04:35 PM
Miss World 2025: . 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. మొత్తం 120 దేశాలకు సంబంధించిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొంటున్నారు.
మహబూబ్నగర్, మే 15: మిస్ వరల్డ్ పోటీదారులు మహబూబ్నగర్లోని పిల్లలమర్రిలో సందడి చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా రాష్ట్రంలోని టూరిజం అభివృద్ధి కోసం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. 72వ మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలకు హైదరాబాద్ ఆతిధ్యం ఇస్తోంది. మొత్తం 120 దేశాలకు సంబంధించిన సుందరీమణులు ఈ పోటీలో పాల్గొంటున్నారు. మొత్తం పది రోజుల పాటు కొనసాగనున్న ఈ పోటీల్లో తెలంగాణలో పర్యాటకంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న స్థలాలను మిస్ వరల్డ్ పోటీల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలన్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా కేంద్రం పిల్లలమర్రిని కూడా ఎంచుకున్నారు. 700 సంవత్సరాల చారిత్రాత్మక పిల్లలమర్రికి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గనున్న సుందరీమణులు రానున్నారు. దాదాపు 22 దేశాలకు చెందిన సుందరీమణులు పిల్లలమర్రికి వెళ్లనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్పై కేసు.. కారణమిదే
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు ప్రారంభం.. భారీగా తరలివస్తున్న భక్తులు
Read Latest Telangana News And Telugu News
Updated at - May 15 , 2025 | 04:36 PM