Suryapet: ఏసీబీ అదుపులో సూర్యాపేట డీఎస్పీ, పట్టణ సీఐ
ABN , Publish Date - May 13 , 2025 | 05:45 AM
ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ వైద్యుడిపై నమోదైన కేసులో రిమాండ్కు తరలించకుండా ఉం డేందుకు నగదు డిమాండ్ చేసిన సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

ఓ కేసులో రూ.25 లక్షలు ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ వైద్యుడికి డిమాండ్
ఏసీబీకి వైద్యుడి ఫిర్యాదు.. కేసు నమోదు
సూర్యాపేటక్రైం, మే 12 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్ వైద్యుడిపై నమోదైన కేసులో రిమాండ్కు తరలించకుండా ఉం డేందుకు నగదు డిమాండ్ చేసిన సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేటలోని ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్తోపాటు వైద్యుడిపై సూర్యాపేట ఐఎంఏ ప్రతినిధుల ఫిర్యాదుతో ఏప్రిల్ 29న పట్టణ పోలీ్సస్టేషన్లో కేసు నమోదైంది.
ఈ కేసులో రిమాండ్కు పంపకుండా ఉండాలంటే డీఎస్పీ పార్థసారథి, పట్టణ సీఐ వీరరాఘవులు రూ.25లక్షలు ఇవ్వాలని వైద్యుడిని డిమాండ్ చేశారు. దీంతో ఆ వైద్యుడు ఏసీబీ అధికారులకు ఫిర్యా దు చేశాడు. డబ్బులు అడిగినట్టు ఆధారాలు చూపడంతో డీఎస్పీ, సీఐలపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీష్చందర్ తెలిపారు.