Agriculture Department: వ్యవసాయ శాఖలో ప్రమోషన్ల పంచాయితీ
ABN , Publish Date - May 20 , 2025 | 04:23 AM
వ్యవసాయ శాఖలో పదోన్నతుల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని సీనియర్ వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యవసాయ శాఖలో పదోన్నతుల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని సీనియర్ వ్యవసాయ విస్తరణ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి ముజీబ్ మాట్లాడుతూ.. శాఖలో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలను పక్కనపెట్టి, సీనియర్లను కాదని జూనియర్లకు పదోన్నతులు కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని నియమించి పదోన్నతులు కల్పించాలని మిత్తల్కు విజ్ఞప్తి చేశారు.