Share News

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం

ABN , Publish Date - May 17 , 2025 | 12:30 PM

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం ఉందని తెలిపారు. హైదరాబాద్ జనాభా 33 శాతానికి చేరిందని అన్నారు. నగరానికి ఎంతోమంది జీవనోపాధి కోసం వస్తుంటారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.

Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాం
Kishan Reddy

హైదరాబాద్: ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయని.. అభివృద్ధి పనుల్లో మాత్రం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఇవాళ(శనివారం) బోరబండలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. చాలా సంవత్సరాలుగా ఈ రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని రెహమత్‌నగర్ ప్రజలు ఆందోళన చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.


ఎన్నో ఆందోళనల తర్వాత ఈ రిజర్వాయర్‌ పూర్తి అవ్వడం సంతోషకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం ఉందని తెలిపారు. హైదరాబాద్ జనాభా 33 శాతానికి చేరిందని అన్నారు. నగరానికి ఎంతోమంది జీవనోపాధి కోసం వస్తుంటారని చెప్పారు. హైదరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గత పదేళ్లుగా హైదరాబాద్‌కు ఒక్క చుక్క అదనపు నీరు గోదావరి, కృష్ణా జలశయాల నుంచి రాలేదని అన్నారు. భాగ్యనగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని.. నీటిశాతంలో సిటీకి ఎక్కువ కేటాయించాలని కోరారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన ప్లానింగ్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్నిరకాలుగా కృషిచేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


తాగునీటి సమస్యకు పరిష్కారం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam-Prabhakar.jpg

యూసుఫ్‌గూడాలో రూ.75 లక్షలతో అండర్ గ్రౌండ్ నాళ ఆధునికీకరణకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఇన్‌చార్జి అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, వాటర్ బోర్డ్ ఎంపీ అశోక్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున గతంలో కోరామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.


హైదరాబాద్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్, బోరబండ డివిజన్‌లలో తాగునీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. రూ.5.75 కోట్లతో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి రిజర్వాయర్‌ను ప్రారంభించామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. గత పదేళ్లలో నగరంలో 13.80 లక్షల కనెక్షన్లు పెరిగాయని తెలిపారు. గతంలో కృష్ణా, గోదావరి నుంచి వచ్చే నీటిని నగరంలో వినియోగించలేదని చెప్పారు. దాదాపు రూ. 7 వేల కోట్లతో 20 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇందుకోసం టెండర్ల ప్రక్రియ చేపట్టామని తెలిపారు. రహమత్‌నగర్, బోరబండ ప్రజలు చాలా కాలంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. తాగునీటి సమస్యకు చెక్ పెట్టేలా రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టామని అన్నారు. హైదరాబాద్‌లో నెలకొన్న పలు సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్న ప్రభాకర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

KTR: సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

High Court: 132 కిలోల మత్తుపదార్థాల పట్టివేత కేసులో బెయిల్‌ ఇవ్వలేం: హైకోర్టు

Fake Cotton Seeds: 40 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2025 | 12:38 PM