Share News

CM Revanth Reddy: సీపీ సీవీ ఆనంద్‌కు సీఎం అభినందనలు

ABN , Publish Date - May 18 , 2025 | 04:02 AM

మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీసులు నంబర్‌వన్‌ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు.

CM Revanth Reddy: సీపీ సీవీ ఆనంద్‌కు సీఎం అభినందనలు

  • డ్రగ్స్‌ నియంత్రణలో అవార్డుపై హర్షం

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీపడి తెలంగాణ పోలీసులు నంబర్‌వన్‌ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలవాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్‌ కమిషనర్‌, సిటీ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చీఫ్‌ సీవీ ఆనంద్‌, ఆయన బృందానికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాదక ద్రవ్యాలు లేని తెలంగాణ కోసం తాను కంటున్న కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి పోలీసుకు మద్దతుగా ఉంటానని సీఎం స్పష్టంచేశారు. దుబాయ్‌లో జరిగిన అంతర్జాతీయ పోలీసు సమ్మిట్‌లో ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ యాంటీ నార్కోటిక్స్‌’ అవార్డును అందుకున్న సందర్భంగా సీవీ ఆనంద్‌ శనివారం ఉదయం సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం అభినందించారు.


హజ్‌ యాత్రికులకు సీఎం శుభాకాంక్షలు

శామీర్‌పేట: హజ్‌యాత్రకు వెళ్తున్న పలువురు ముస్లింలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శామీర్‌పేటకు చెందిన రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ముజీబుద్దీన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నగరంలోని స్టేట్‌ హజ్‌ హౌస్‌లో 300 మంది ముస్లింలను మక్కాకు పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.


హజ్‌ యాత్రికులకు సీఎం శుభాకాంక్షలు

శామీర్‌పేట: హజ్‌యాత్రకు వెళ్తున్న పలువురు ముస్లింలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శామీర్‌పేటకు చెందిన రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ముజీబుద్దీన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నగరంలోని స్టేట్‌ హజ్‌ హౌస్‌లో 300 మంది ముస్లింలను మక్కాకు పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Updated Date - May 18 , 2025 | 04:02 AM