CBI: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలం పొడిగింపు
ABN , Publish Date - May 08 , 2025 | 03:59 AM
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈయన 2023 మే 25న రెండేళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టారు.

న్యూఢిల్లీ, మే 7 : సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈయన 2023 మే 25న రెండేళ్ల కాలానికి బాధ్యతలు చేపట్టారు. ప్రధాని అధ్యక్షతన సోమవారం సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ సూద్ పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఈ కమిటీలో సభ్యులు.
ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం మేరకు కేబినెట్ నియామకాల కమిటీ సూద్ పదవీ కాలం పొడిగింపునకు ఆమోదం తెలిపింది. పలు ముఖ్యమైన కేసులను ప్రవీణ్ సూద్ ఆధ్వర్యంలో సీబీఐ విచారించింది. వీటిలో పలురాష్ట్రాలతో సంబంధం ఉన్న, విదేశాలకు విస్తరించిన కేసులూ ఉన్నాయి. 1986 బ్యాచ్, కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సూద్ సీబీఐ డైరెక్టర్గా నియమితులయ్యే సమయానికి ఆ రాష్ట్ర డీజీపీగా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News