Share News

BJP: మ్యాచ్‌ఫిక్సింగ్‌గా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు

ABN , Publish Date - Jun 04 , 2025 | 08:27 AM

భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు మండిపడ్డారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌గా కొనసాగుతున్నాయని వారు విమర్శించారు. ఇంకా వారు ఏమన్నారంటే...

BJP: మ్యాచ్‌ఫిక్సింగ్‌గా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు

- ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదు

- బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం

హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవాల్సిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌గా కొనసాగుతున్నాయని బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి అంజన్‌, శ్రవణ్‌, మహేందర్‌(BJP corporators Akula Srivani Anjan, Shravan, Mahender) మండిపడ్డారు. మంగళవారం సరూర్‌నగర్‌లో వారు మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాల తీరును ఎండగట్టారు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్వహించే కౌన్సిల్‌ సమావేశాలతో ప్రజలకు ఉపయోగం ఉండటం లేదన్నారు.


city3.2.jpg

సమావేశాలలో ప్రజా సమస్యలు చర్చ జరగడం లేదన్నారు. బస్తీల్లో చెత్త పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నాయని, డ్రైనేజీ పైపులైన్‌లు లీకై మురుగునీరు రోడ్లపై పారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయన్నారు. టౌన్‌ప్లానింగ్‌ అవినీతి, నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ అనుమతుల్లో జాప్యం, అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయన్నారు. ఆస్తిపన్ను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాలు ప్రజల అభివృద్ధి కోసం జరగాలన్నారు.



ఈ వార్తలు కూడా చదవండి.

అమెరికాలో తెలుగు విద్యార్థులకు అండగా ఉంటాం

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ఖాయం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 04 , 2025 | 08:27 AM