పెళ్లి తర్వాత మొదటిసారి లండన్లో ఉన్న భర్తను కలవడానికి వెళ్తున్న నవ వధువు మృతి. నిన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన నవ వధువు. బలోత్రాకు చెందిన ఖుష్బు రాజ్పురోహిత్ జనవరి 2025లో వివాహం చేసుకోగా.. ఆమె భర్త లండన్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే తన వివాహం తర్వాత మొదటిసారిగా తన భర్తను కలవడానికి విమానంలో లండన్కు వెళ్తున్న ఖుష్బు. ఆమె తండ్రి ఆమెను అహ్మదాబాద్ విమానాశ్రయంలో దింపడానికి వచ్చినప్పుడు దిగిన ఫోటో, ఆమె చివరి వీడియో ప్రస్తుతం జనాలను కలచివేస్తుంది