ఏపీ ఈసెట్
ABN , Publish Date - Mar 17 , 2025 | 01:58 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుంచి ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ ఈసెట్) 2025 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుంచి ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏపీ ఈసెట్) 2025 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మేథ్స్) అభ్యర్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 2025 ఏప్రిల్ 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 2025 మే 1 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎంట్రెన్స్ను అనంతపురంలోని జేఎన్టీయూ నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్ష 2025 మే 6వ తేదీన జరుగుతుంది. పూర్తి వివరాలకుhttps://cets.apsche.ap.gov.in/ APSCHE/APSCHEHome.aspx వెబ్సైట్ చూడవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..
Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత