Helicopter Crash: ఉత్తరాఖండ్లో కూలిన ప్రైవేట్ హెలికాప్టర్
ABN , Publish Date - May 08 , 2025 | 10:31 AM
న్యూ ఢిల్లీ: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరకాశీ జిల్లాలోని గంగానది సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

న్యూ ఢిల్లీ: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళుతున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది (helicopter crash). ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలోని గంగానాని సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు పర్యాటకులు అక్కడికక్కడే మృతి (Five Dead) చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు (Two Injured). సమాచారం అందుకున్న అధికారులు హెలికాప్టర్ కూలిపోయిన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు.
చార్ధామ్ యాత్ర పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ యాత్రను చూసేందుకు, అలాగే పవిత్ర పుణ్య క్షేత్రాలు (యమునోత్రి, గంగోత్రి, కేధార్నాథ్, భద్రీనాథ్) దర్శించుకునేందుకు పర్యటకులు వస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున ఉత్తరాఖండ్కు వస్తున్నారు. ఈ యాత్రకు చాలా మంది హెలీకాప్టర్ను ఉపయోగిస్తుంటారు. అందులో భాగంగా 7గురు యాత్రికులు ప్రైవేట్ హెలీకాప్టర్లో వెళుతుండగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగానాని సమీపంలో ఒక్కసారిగా హెలీకాఫ్టర్ కుప్పకూలిపోయింది. చార్ధామ్ యాత్ర ప్రారంభైన 5 రోజులకే ఈ ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: ఆపరేషన్ సిందూర్పై చైనా, అమెరికా స్పందన
హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదంపై దర్యాప్తు చేయాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే..
పాక్ కవ్వింపు చర్యలు.. తిప్పికొట్టిన భారత్ సైన్యం..
న్యాయం జరిగింది: సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబం
For More AP News and Telugu News