Raja Raghuvanshi Case: పెళ్లికి ముందే ప్లాన్.. ప్రియుడికి ఇచ్చిన మాట కోసం దారుణం..
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:43 AM
Raja Raghuvanshi Case: సోనమ్ ప్రియుడు రాజ్ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రాజ్ను ప్రేమిస్తున్న సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు.

ఢిల్లీ: మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ పెళ్లైన 20 రోజులకే భార్య కారణంగా హత్యకు గురయ్యాడు. మే 11వ తేదీన రాజా రఘువంశీకి, సోనమ్కు పెళ్లయింది. మే 23వ తేదీన అతడు హత్యకు గురయ్యాడు. సోనమ్ పక్కా ప్లాన్తో రాజాను హత్య చేయించింది. ప్రియుడు రాజ్ కుశ్వాహకు ఇచ్చిన మాట కోసం భర్తను చంపేసింది. సోనమ్, రాజా ప్రాణాలు తీయటం వెనుక ఓ పెద్ద ప్లాన్ ఉంది. ప్రియుడితో పెళ్లి కోసమే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇందుకోసం ఐదు నెలల ముందునుంచే ప్లాన్ చేసింది.
సోనమ్ ప్రియుడు రాజ్ ఆమె తండ్రి దగ్గర పనిచేసేవాడు. ఆ సమయంలోనే సోనమ్, రాజ్లకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రాజ్ను ప్రేమిస్తున్న సంగతి ఆమె తన తండ్రికి చెప్పలేదు. అతడితో పెళ్లికి తండ్రి ఒప్పుకోడని భావించింది. అందుకే ఓ ప్లాన్ వేసింది. ముందుగా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని, అతడ్ని చంపేయాలని అనుకుంది. భర్త చనిపోయిన తనను రాజ్ పెళ్లి చేసుకోవడానికి తండ్రి ఒప్పుకుంటాడని భావించింది. అప్పటికి ఇంకా రాజాతో పెళ్లి నిశ్చయం కాలేదు.
తన జీవితంలోకి ఎవరు వచ్చినా చంపేయాలని సోనమ్ అనుకుంది. పాపం.. రాజా బుక్ అయ్యాడు. ‘రాజాను చంపేద్దాం.. దాన్ని ఓ దోపిడీలాగా చిత్రీకరిద్దాం. నా భర్త చనిపోతే.. మా నాన్న నీతో పెళ్లికి ఒప్పుకుని తీరతాడు’ అని రాజ్ కుశ్వాహకు చెప్పినట్లు సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారమే పెళ్లైన 20 రోజులకే పక్కా ప్లాన్ ప్రకారం సోనమ్, రాజాను హత్య చేయించింది. ఎంత ప్లాన్ చేస్తే ఏం లాభం .. చివరకు అందరూ దొరికిపోయి జైలు పాలయ్యారు.
ఇవి కూడా చదవండి
నాకు డ్రగ్స్ ఇచ్చారు.. పోలీసుల విచారణలో సోనమ్..
రాజా మర్డర్.. వైరల్గా మారిన పెళ్లి వీడియో..