Share News

Cashless Treatment: రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం కొత్త పథకం.. రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం..

ABN , Publish Date - May 06 , 2025 | 04:52 PM

Cashless Treatment Scheme: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ పథకం అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ పథకం త్వరలో అమల్లోకి వస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

Cashless Treatment: రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం కొత్త పథకం.. రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్యం..
Nitin Gadkari Unveils Cashless Treatment Scheme

Nitin Gadkari Unveils Cashless Treatment Scheme: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త పథకం ఉపశమనం కలిగించనుంది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ పథకం కింద బాధితుడు ప్రమాదం జరిగిన తేదీ నుంచి ఏడు రోజుల వరకు ఏదైనా గుర్తింపు పొందిన ఆసుపత్రిలో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఈ పథకం ఎప్పటి నుంచి మే 5, 2025 సోమవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ పథకానికి ‘క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025’ గా కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది.


రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎవరైనా మోటారు వాహనం వల్ల రోడ్డు ప్రమాదానికి గురైతే, ఈ పథకం కింద దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వారికి ఉచిత చికిత్స లభిస్తుంది . ప్రమాద బాధితుడు ప్రభుత్వ లేదా నియమిత ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు. డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.


ఈ పథకం కింద, బాధితుడికి ప్రమాదం జరిగిన తేదీ నుంచి తదుపరి ఏడు రోజుల వరకూ గరిష్ఠంగా రూ. 1,50,000 వరకు ఉచిత చికిత్స అందుతుంది. ప్రభుత్వం "నియమించిన" ఆసుపత్రులలో మాత్రమే ఈ సౌకర్యం పూర్తిగా వర్తిస్తుంది. ఒక నివేదిక ప్రకారం, ఈ పథకాన్ని అమలు చేయడానికి జాతీయ ఆరోగ్య అథారిటీ (NHA) రాష్ట్ర పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థతో కలిసి పనిచేస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది తీవ్రంగా గాయపడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువగా నష్టపోతోంది ద్విచక్ర వాహనదారులు, పాదచారులే.


Read Also: Shashi Taroor: ఐరాస సమావేశంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

Mallikarjun Kharge: ఉగ్రదాడి సమాచారంతోనే మోదీ కశ్మీర్ ట్రిప్ రద్దయింది: ఖర్గే

India - Pakistan war: యుద్ధానికి సిద్ధమా.. తర్వాత పరిస్థితి ఏమిటి

Updated Date - May 06 , 2025 | 05:39 PM